మహిళలే మహరాణులు… గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ పీఠంను మహిళలకే కేటాయించిన ఎన్నికల అధికారులు
గ్రేటర్ హైదరాబాద్లో పొలిటికల్ హీట్ మొదలైంది. అంతా అనుకున్నట్లుగానే మేయర్ పీఠం మహిళలకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి డిసెంబర్ ఒకటిన జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పదవిని ఈసారి మహిళకు కేటాయించారు. అలాగే జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లో 50 శాతం...
Hyderabad to get Woman Mayor : గ్రేటర్ హైదరాబాద్లో పొలిటికల్ హీట్ మొదలైంది. అంతా అనుకున్నట్లుగానే మేయర్ పీఠం మహిళలకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి డిసెంబర్ ఒకటిన జరుగనున్న ఎన్నికల్లో మేయర్ పదవిని ఈసారి మహిళకు కేటాయించారు. అలాగే జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి రిజర్వేషన్ వివరాలను వెల్లడించారు.
ఎస్టీలకు రెండు, ఎస్సీలకు పది, బీసీలకు 25 సీట్లు రిజర్వ్ చేశారు. జనరల్ క్యాటగిరీలో 88 స్థానాలున్నాయి. అన్ని క్యాటగిరీల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్ పత్రాలు పొందవచ్చని పార్థసారథి తెలిపారు.
టీఎస్ఈసీ వెబ్సైట్లో నామినేషన్ పత్రం, ఇతర పత్రాలను ప్రింట్ తీసుకొని, వాటిని పూర్తిచేసిన తరువాత సంబంధిత రిటర్నింగ్ అధికారికి పోటీచేసే అభ్యర్థి లేదా వారిని ప్రతిపాదించిన వ్యక్తి గానీ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500 జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు రూ.5,000 నామినేషన్ ఫీజును డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది.