అధునిక యుగంలో రాను రాను పెళ్లి తంతు మారిపోతుంది. పెళ్లిళ్లు పేరంటాలు రొటీన్గా చేసుకుంటే అందులో మన ప్రత్యేకత ఏముంటుంది అని అనుకుంటున్నారో.. లేక మనిషన్నాకా కూసింత కళాపోషణ ఉండాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ కొంతమంది మాత్రం తమ ఎంగేజ్మెంట్, పెళ్లి వేడుకలను వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ ఎంగేజ్మెంట్ సెరెమని జరుగుతోంది. వేదికకు ముందు భాగంలో రెండు వైపులా అతిథులు, బంధుమిత్రులు కూర్చుని ఉన్నారు.. వధూవరులు రింగ్స్ మార్చుకునే సమయం ఆసన్నమైంది. సాధారణంగా అయితే వధూవరుల కుటుంబసభ్యులు వారికి ఉంగరాలు ఇచ్చి మార్చుకోవాల్సిందిగా చెబుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తొలుత ఎవ్వరికీ అర్థం కాలేదు. వేదికకు ముందున్న ఖాళీ స్థలంలోంచి ఒక టీ పాయ్ సైజ్ టేబుల్.. దానిపై పెద్ద రింగ్ వేదిక వైపు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రింగ్స్ మార్చుకునే సమయంలో ఇంత పెద్ద రింగుని సీన్లోకి ప్రవేశపెట్టారు.. ఇంతకీ ఇంత పెద్ద రింగుతో కొత్త జంట ఏం చేస్తారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూడసాగారు. అంతలోనే ఆ రింగ్ వేదిక వద్దకు చేరుకోవడం.. ఆ రింగు పై భాగంలోంచి రెండు రింగ్స్ తీసుకుని వాళ్లు చేతికి ఉంగరాలు మార్చుకోవడం చూశాకా అందరికీ సస్పెన్స్ వీడింది. ” ఓసినీ పాసుగలా.. ఇదా మీ రింగులో యవ్వారం ” అన్నట్టుగా చూశారు అక్కడున్న వాళ్లంతా. మొత్తానికి ఈ వెరైటీ అటెంప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..