బరేలీ జిల్లా ఫరీద్పూర్ ప్రాంతంలోని ఎస్డీఎం కాలనీకి చెందిన ముఖేష్ వాల్మీకి, మరో వ్యక్తి ఫుల్గా మద్యం సేవించారు. మద్యం మత్తులోనే వారు రెండు కుక్కలను పట్టుకుని ఒక కుక్క రెండు చెవులు, మరో కుక్క తోకని కట్ చేశారు. అనంతరం వాటికి ఉప్పు, కారం దట్టించి మందులోకి మంచింగ్ చేసుకున్నారు. ఇది గమనించిన ధీరజ్ పతాక్ అనే వ్యక్తి సదరు వ్యక్తులపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి దాడిలో రెండు కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి అఖిలేష్ చౌరాసియా తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..