మనేంద్రగఢ్ భరత్పుర్చిర్మిరి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. స్కూటీలోకి దూరిన కొండచిలువ.. అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికులు వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించడంతో.. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి స్కూటీ భాగాలను విడదీసి కొండచిలువను బయటికి తీశారు రెస్క్యూ సిబ్బంది. ఆ తర్వాత సురక్షితంగా స్థానిక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..