29 Dogs Gunned: దారుణం ..! 29 కుక్కలపై కాల్పులు.. వాళ్లు అసలు మనషులేనా..? మరిన్ని వివరాలు..

|

Jul 24, 2022 | 9:41 AM

ఖతర్‌ దేశం దోహాలో దారుణం చోటుచేసుకుంది. ఓ చిన్నారిని కుక్క కరిచిందనే నెపంతో దాదాపు 29 వీధి కుక్కలను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే..


ఖతర్‌ దేశం దోహాలో దారుణం చోటుచేసుకుంది. ఓ చిన్నారిని కుక్క కరిచిందనే నెపంతో దాదాపు 29 వీధి కుక్కలను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే.. దోహాలో నివసిస్తున్న ఓ బాలుడిపై కుక్క దాడి చేసి, గాయ పరిచింది. అనంతరం ఆ కుక్క ఇతర కుక్కలతో కలిసి సమీపంలోని ఓ ఫ్యాక్టరీలోకి ప్రవేశించాయి. ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో ఆ ఫ్యాక్టరీలోకి ప్రవేశించి, అక్కడి సెక్యూరిటీ గార్డును తమ వద్దనున్న ఆయుధాలతో బెదిరించి, లోపలికి ప్రవేశించి అక్కడనున్న కుక్కలను విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఈ ఘటనలో 29 వీధి కుక్కలు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. నిజానికి ఆ ప్రాంతం శునక సంరక్షణ కేంద్రం. అక్కడ నివసించే కుక్కలు ఎవ్వరికీ హాని తలపెట్టవని, అవి చాలా స్నేహ పూర్వకంగా ఉంటాయని, అందరూ వాటిని ఇష్టపడతారని పాస్ రెస్‌క్యూ కతర్‌ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పేర్కొంది. అటువంటి కుక్కలను ఆయుధాలతో కాల్చి చంపడంపై నెటిజన్లు, జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Follow us on