డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన భారత బాస్కెట్ బాల్ ఆటగాడు.. సత్నామ్సింగ్పై రెండేళ్ల నిషేధం విధించిన నాడా
డోపింగ్లో మరో ఆటగాడు దొరికిపోయాడు. అయితే ఈ సారి మన భారత ఆటగాడు దొరికి పోవడం సంచలనంగా మారింది. భారత్ నుంచి ఎన్బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్సింగ్పై..
డోపింగ్లో మరో ఆటగాడు దొరికిపోయాడు. అయితే ఈ సారి మన భారత ఆటగాడు దొరికి పోవడం సంచలనంగా మారింది. భారత్ నుంచి ఎన్బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్సింగ్పై నాడా రెండేళ్ల నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షల్లో అతడు విఫలమవడమే ఇందుకు కారణం.
అయితే.. బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సత్నామ్సింగ్పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (NADA) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షల్లో అతడు విఫలమైనట్లు గురువారం వెల్లడించింది.
జాతీయ బాస్కెట్బాల్ సంఘం (NBA)కు భారత్ నుంచి ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్ సింగ్. డల్లాస్ మేవెరిక్ జట్టు తరఫున ఆడుతాడు ఈ పంజాబీ ఆటగాడు. అయితే డోపింగ్లో పట్టుండిన తర్వాత పంజాబ్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఇంతవరకు స్పందించలేదు.