Viral News: ఓరి మీ దుంపలు తెగ.. ఎక్కడినుంచి వస్తాయిరా మీకీ ఐడియాలు

|

Oct 16, 2024 | 7:47 PM

17 ఏళ్ల యువతి తన కుటుంబానికి మత్తుమందు ఇచ్చి తన ప్రియుడితో కలిసి నగలు, రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. బాలిక రాత్రి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఆమె తన తల్లి, సోదరి కోసం ఆలూ పరాఠాలను సిద్ధం చేసింది. బంగాళాదుంపలను నిద్ర మాత్రలతో నింపింది.

Viral News: ఓరి మీ దుంపలు తెగ.. ఎక్కడినుంచి వస్తాయిరా మీకీ ఐడియాలు
Girl Mixing Sleeping Pills With Aloo Parathas
Follow us on

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 17 ఏళ్ల యువతి తన కుటుంబానికి మత్తుమందు ఇచ్చి తన ప్రియుడితో కలిసి పాతికేళ్ల నగలు, రూ.లక్ష నగదు తీసుకుని పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. మైనర్‌కి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే నారాయణ్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక రాత్రి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ఆమె తన తల్లి, సోదరి కోసం ఆలూ పరాఠాలను సిద్ధం చేసింది. బంగాళాదుంపలను నిద్ర మాత్రలతో నింపింది. ఆమె ఉద్దేశం ఏమిటో తెలియక కుటుంబ సభ్యులు భోజనం చేసి వెంటనే గాఢ​నిద్రలోకి జారుకున్నారు.

తెల్లవారుజాము వరకు కుటుంబసభ్యులు నిద్ర లేవలేదు స్పృహలోకి వచ్చిన తరువాత వారు ఇంటిని దోచుకున్నారని, బాలిక కనిపించకుండా పోయిందని వారు గుర్తించారు. ఆమెతోపాటు వారి పూర్వీకుల నగలు, నగదు పోయాయి.బాలిక కోసం వారు వెతకగా పక్కనే ఉంటున్న అమ్మాయి ప్రియుడు మోహన్ సింగ్ కూడా కనిపించకుండా పోయాడని తేలింది. మురార్‌కు చెందిన మరో యువకుడితో కేవలం ఆరు రోజుల క్రితం అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. దీంతో అమ్మాయి ప్రియుడు మోహన్ సింగ్ జంట కలిసి పారిపోవాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

గోలా కా మందిర్ స్టేషన్‌కు చెందిన పోలీసులు విచారణ ప్రారంభించి, జంట ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేశారు. సమీపంలోని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న అధికారులు వారి ఆచూకీ కోసం కృషి చేస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు.