Viral News: తక్కువ వ్యవధిలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. సామాన్యలు కోట్ల డబ్బును సంపాదించాలంటే తమ జీవిత కాలం కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి నిమిషాల వ్యవధిలో కోట్ల డబ్బు సంపాదించాడు. కేవలం 32 నిమిషాల్లో రూ.5 కోట్లు సంపాదించాడు.
వివరాల్లోకెళితే.. అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ క్యామ్ రక్కమ్.. పేయింటింగ్స్ వేసేవాడు. క్యామ్ ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. క్యామ్ కోవిడ్ బారిన పడి.. తీవ్రంగా నష్టపోయాడు. ఇలాంటి సమయంలో ఆయనను అదృష్టం వరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యావత్ ప్రపంచం డిజిటల్ బాట పట్టింది. అతను కూడా డిజిటల్ ప్లాట్ఫామ్ను ఆశ్రయించాడు. అతను వేసిన పెయింటింగ్స్ను ఆన్లైన్లో వేలానికి పెట్టాడు. ఈ పెయింటింగ్ను కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. చివరకు ఇది రూ. 5 కోట్లకు ఫిక్స్ అయ్యింది. కేవలం 32 నిమిషాల్లో రూ. 5 కోట్లకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా ఈ వేలానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read:
Astro Tips: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా?.. యాలకులతో ఇలా చేస్తే డబ్బే డబ్బు..!
Banks Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు.. వివరాలివే..!
Big News Big Debate: 40 ఏళ్ల తెలుగుదేశం.. భవిష్యత్తుకు ఏది అభయం.. ప్రత్యేక కథనం..!