ఒడిశాలో పాఠశాలల్లో కరోనా కలవరం.. 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పాజిటివ్

ఒడిశాలో 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.

ఒడిశాలో పాఠశాలల్లో కరోనా కలవరం.. 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు పాజిటివ్
Follow us

|

Updated on: Jan 11, 2021 | 10:51 AM

కరోనా దెబ్బకు ఇంతకాలం మూతపడ్డ విద్యాసంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ మరోవైపు వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అటు ఒడిశా రాష్ట్రంలో 10,12 వ తరగతి చదివే విద్యార్థుల కోసం పాఠశాలలను పునర్ ప్రారంభించింది ఆ రాష్ట్ర సర్కార్. అయితే, పాఠశాలకు వచ్చి విద్యార్థులకు వైద్యాధికారులు పరీక్షలు నిర్వహించారు. దీంతో 31 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.

కరోనా వల్ల 9నెలల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. గజపతి జిల్లాలో 10,12 తరగతి విద్యార్థులకు పాఠశాలలను జనవరి 8వతేదీన పునర్ ప్రాంభించారు. పాఠశాలల పునర్ ప్రారంభం అనంతరం గజపతి జిల్లాలో 31 మంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా సోకిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పాత్ర చెప్పారు. మరోవైపు, మోహనా బ్లాకులో 21 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, మళ్లీ కరోనా సోకుతుండటం కలకలం రేపింది. కరోనా సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, దీంతో వారిని ఇళ్లలోనే క్వారంటైన్ చేశామని వైద్యాధికారులు చెప్పారు. రోనా సోకిన వారు కోలుకునే వరకూ పాఠశాలలకు రావద్దని సూచించామని వైద్యాధికారులు తెలిపారు.

Telangana coronavirus: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్.. కొత్తగా 224 మందికి పాజిటివ్