Telangana: షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అంతకుముందు ఏం జరిగిందంటే..?

|

Jan 11, 2023 | 5:23 PM

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Telangana: షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అంతకుముందు ఏం జరిగిందంటే..?
Road Accident
Follow us on

తెలంగాణ ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ఏకంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పాలడుగు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మధిర నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణించే సూపర్ లగ్జరీ బస్సు పాలడుగు గ్రామానికి చేరుకుంది. ఈ సమయంలో ప్రధాన రహదారిపై లారీని తప్పించబోయి ఇంట్లోకి దూసుకెళ్లింది. బస్సు ఏకంగా డాబా ఇంట్లోకి దాదాపు సగం మేరకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మొదట లారీని ఢీకొట్టిన అనంతరం ఇంట్లోకి దూసుకెళ్లినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీశారు. అనంతరం గాయలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఈ ఘటనలో బస్సు, లారీతోపాటు ఇల్లు కూడా ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

Paladugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..