మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్న దొంగలు
మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో వరుస చోరీలు
ఎత్తుకెళుతున్న విజువల్స్ సీసీ టీవీల్లో రికార్డు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఆ గ్రామాల్లో మేకలు, గొర్రెలను ఎత్తుకెళుతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అవును.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోనొ ఏదోక ఓ ఊళ్లో మేకలు, గొర్రెలను దొంగిలిస్తున్నారు. ఈ వరుస దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు వాటి యజమానులు. లెటెస్ట్గా వెంకటగిరి తండాలో మేకలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ చోరీపై దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా రాత్రి పూట పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని కోరుకుంటున్నారు స్థానికులు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడంతో.. కొన్ని చోట్ల మాత్రం చోరీ విజువల్స్ రికార్డు అవుతున్నాయి. దీంతో పోలీసులు.. మేకలు, గొర్రెల దొంగలిస్తున్న దొంగల ఆట కట్టిస్తారా..? లేదా అనేదీ వేచి చూడాలి.
Also Read: వరుస అత్యాచారాలు, హత్యలు.. గుంటూరు జిల్లాలో హడలిపోతున్న మహిళలు