భద్రాచలంలో పూర్తైన వారధి.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు 10 సంవత్సరాలుగా నిర్మాణం సాగుతూ వచ్చింది. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భద్రాచలం గోదావరిపై రెండవ బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఒకటి కాదు రెండు కాదు 10 సంవత్సరాలుగా నిర్మాణం సాగుతూ వచ్చింది. ఇటీవల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి 17న జరుగు శ్రీరామనవమికి రెండవ బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగాలని ఆదేశించారు. దీంతో ముమ్మరంగా పనులు చేపట్టి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్త స్థాయిలో అందుబాటులోకి తెచ్చార. ఈ ఏడాది శ్రీరామనవమికి భ్రదాచలం వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పి అందుబాటులోకి రానుంది.
నాలుగు రాష్ట్రాలకు భద్రాచలం కేంద్ర బిందువు కావడంతో రాకపోకలతో పాటు ఆయా రాష్ట్రాల నుండి భారీ లోడులతో వెళ్లే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగడంతో గోదావరి నదిపై రెండవ బ్రిడ్జి నిర్మాణం అవశ్యకత ఏర్పడింది. గోదావరి నదిపై 1.2 కిలోమీటర్ల పొడవునా రూ.65 కోట్ల వ్యయంతో 37 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరుగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకానికి వచ్చే భక్తులతో పాటు, వాహనదారులకు నూతన బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగించడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుంది. శ్రీరామ నవమి సందర్భంగా ముందుగా వాహనాల రాకపోకలకి అనుమతి ఇచ్చి.. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రజా ప్రతినిధులచే అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఇటు భక్తులు, అటు ఏజెన్సీ వాసుల కల నెరవేరింది. గోదావరిపై నిర్మించిన రెండవ వారథి అందుబాటులోకి వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..