Telangana: చుట్టూ పంట పొలాలు.. అడ్డంగా చీర కట్టి ఆట మొదలెట్టారు.. కట్ చేస్తే..

| Edited By: Shaik Madar Saheb

Jul 07, 2024 | 11:15 AM

చుట్టూ పంట పొలాలు.. మంచిగా.. ఓ చెట్టు నీడకు చేరారు.. టేబుల్ వేసి చుట్టూ కూర్చీలు వేసుకున్నారు.. చాటు కోసం చీరను కూడా అడ్డుగా కట్టారు.. వీళ్లేదో చక్కగా పనిచేసుకుంటున్నారనుకునేరు.. అబ్బే అలాంటిదేం లేదు.. హాయిగా పేకాట ఆడుతున్నారు.. ఈ క్రమంలోనే.. వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు దిమ్మతిరిగే ప్లాన్ వేశారు..

Telangana: చుట్టూ పంట పొలాలు.. అడ్డంగా చీర కట్టి ఆట మొదలెట్టారు.. కట్ చేస్తే..
Crime News
Follow us on

చుట్టూ పంట పొలాలు.. మంచిగా.. ఓ చెట్టు నీడకు చేరారు.. టేబుల్ వేసి చుట్టూ కూర్చీలు వేసుకున్నారు.. చాటు కోసం చీరను కూడా అడ్డుగా కట్టారు.. వీళ్లేదో చక్కగా పనిచేసుకుంటున్నారనుకునేరు.. అబ్బే అలాంటిదేం లేదు.. హాయిగా పేకాట ఆడుతున్నారు.. ఈ క్రమంలోనే.. వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు దిమ్మతిరిగే ప్లాన్ వేశారు.. రైతుల గెటప్ వేసి అక్కడికి చేరుకుని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట రాయుళ్లు తమ ఆటకు ఇబ్బందుల్లేని.. పోలీసులు, కుటుంబ సభ్యులకు అనుమానం రాని రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో పోలీసులు దిమ్మతిరిగే ప్లాన్ వేశారు. ఈ ప్రాంతలో ఎక్కువగా పేకాట ఆడుతున్నారని.. పోలీసులకు సమాచారం అందింది.. అయితే.. పోలీసులు రాగానే పరుగులు తీస్తుండటంతో వారు ఈసారి అదిరిపోయే స్కెచ్ వేశారు.

అయితే.. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు కూలీల వేషం వేశారు. పోలీసులకు ముస్తాబాద్ మండలంలోని బందనకల్ గ్రామ శివారు ప్రాంతంలో పంటపొలాల మధ్య పేకాటాడుతున్నారనే సమాచారం అందింది.. అయితే, పోలీస్ జీప్ రాగానే పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూలీలుగా మారి.. పేకాట స్థావరం దగ్గరికి వెళ్లారు.. వ్యవసాయ కూలీలుగా భావించి.. ఈ పేకాట రాయుళ్ళు దర్జాగా పేకాట ఆడుతున్నారు.

కూలీలే కదా అని వారి దగ్గరకు వెళ్లే వరకు పేకాట ఆడుతున్న వారు పెద్దగా పట్టించుకోలేదు.. చివరకు వారు దగ్గరికి వెళ్లి చుట్టూ చేరారు.. అప్పుడు కూడా వాళ్లకు అర్థం కాలేదు.. చివరకు డ్రెస్ చూసి పేకాట రాయుళ్ళు దెబ్బకు హడలెత్తిపోయారు.. అటు పారిపోలేక.. ఇటు ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ కవర్ చేసే ప్రయత్నం చేశారు  పేకాటరాయుళ్లు..

చివరకు పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురుని అరెస్ట్ చేసి వారి దగ్గరి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుహెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..