హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్ వద్ద సినిమాటిక్ సీన్ కనిపించింది. ఓఆర్ఆర్పై పార్థీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నల్గొండలో చోరీ చేసిన పార్థీ గ్యాంగ్ ఓఆర్ఆర్ పై పారిపోతుండగా.. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఫైనల్గా నలుగురు పార్థీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నేషనల్ హైవే పార్కింగ్ చేసిన వాహనాలే టార్గెట్గా దుండగులు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. దీంతో ఈ గ్యాంగ్కు చెక్ పెట్టేందుకు నల్గొండ పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. పక్కాగా నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. టెక్నాలజీని కూడా వినియోగించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పోలీసులు.. దుండగులను గుర్తించి వెంబడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అలెర్ట్ చేశారు.
దొంగలను పట్టుకునే క్రమంలో నల్గొండ పోలీసులకు.. రాచకొండ పోలీసులు పూర్తి సహకారం అందించారు. పెద్దఅంబర్పేట సమీపంలోని ORR వద్దకు వచ్చేసరికి వారిని కట్టడి చేసి.. అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నం చేయడంతో.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ గ్యాంగ్ అత్యంత డేంజర్ అని పోలీసులు చెబుతున్నారు. పార్థీ గ్యాంగ్ అంటే తెలంగాణ అంతా హడల్. ఎప్పుడూ మారణాయధాలు వెంట పెట్టుకుని ఉంటారట. రాబరీ చేసే సమయంలో ఎవరైనా ఎదురుతిరిగితే నిర్ధాక్షణ్యంగా దాడులకు తెగబడతారు. వారం రోజుల క్రిందట నల్గొండలో ఓ ఇంట్లో చోరీ చేశారు ఈ గ్యాంగ్. అక్కడ అడ్డుకోబోయిన ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దీంతో వీరిపై పూర్తి ఫోకస్ పెట్టిన జిల్లా పోలీసులు.. ప్లాన్ ప్రకారం అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…