Munugode By Poll: ఆయన అలా.. ఆమె ఇలా.. మునుగోడు ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్, బీజేపీ..

|

Sep 20, 2022 | 9:18 AM

Munugode By Poll: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్‌, బీజేపీలు జోరు పెంచాయి. బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి చేరికలపై దృష్టి పెడితే..

Munugode By Poll: ఆయన అలా.. ఆమె ఇలా.. మునుగోడు ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్, బీజేపీ..
Bjp Vs Congress
Follow us on

Munugode By Poll: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్‌, బీజేపీలు జోరు పెంచాయి. బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి చేరికలపై దృష్టి పెడితే.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉప ఎన్నికలపై ప్రకటన రాకముందే.. పార్టీలు జోరు పెంచాయి. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్‌ రెడ్డి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. కీలక నేతలపై ఫోకస్‌ పెట్టారు. గ్రామాల్లో ఉన్న లీడర్లతో స్వయంగా మాట్లాడుతూ బీజేపీలో చేర్చుకునే పనిని ముమ్మరం చేస్తున్నారు. సంస్థాన్‌ నారాయణపురంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ల నుంచి బీజేపీలో భారీగా కార్యకర్తలు, నేతలు చేరారు. ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్‌ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని రాజగోపాల్‌ ఆరోపించారు. మునుగోడు ప్రజల గొంతుకలో వుంటానని, ధర్మ యుద్ధంలో ప్రజలు తనకు మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు.

అటు.. కాంగ్రెస్‌ అభ్యర్థి కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి ఓటరును కలువాలన్న టార్గెట్‌తో క్యాంపెయిన్‌ సరళిని ముందుకు పోనిస్తున్నారు. చండూరు మండలం గొల్లగూడెంలో కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌ గెలుపు ముఖ్యమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..