Harish Rao: గ్రామస్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి హరీశ్ రావు.. బీజేపీ, కాంగ్రెస్ లపై తీవ్ర విమర్శలు..

|

Oct 19, 2022 | 1:46 PM

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా క్యాంపెయినింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో మర్రిగూడ మండలంలోని రాజుపేట తండాలో మంత్రి..

Harish Rao: గ్రామస్థులతో కలిసి టిఫిన్ చేసిన మంత్రి హరీశ్ రావు.. బీజేపీ, కాంగ్రెస్ లపై తీవ్ర విమర్శలు..
Minister Harish Rao
Follow us on

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ముమ్మరంగా క్యాంపెయినింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో మర్రిగూడ మండలంలోని రాజుపేట తండాలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా మంత్రి హరీశ్ రావు బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యం కానీ హామీలిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే.. మళ్లీ టీఆర్ఎస్ ను తిట్టడం తప్ప ఇంకేమైనా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజల కోసం టీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాది లోపు ఇచ్చిన మాటలన్ని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే శివన్నగూడెం రిజర్వాయర్‌ను పూర్తి చేసి భూమిలోని ఫ్లోరైడ్‌ను తరిమి కొడతామని పేర్కొన్నారు.

కృష్ణా జలాల్లో నీళ్ల వాటా తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. నిరుద్యోగులను కేంద్రం మోసం చేస్తోంది. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ శాఖలో కూడా అగ్ని పత్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటున్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దేశంలో ఆకలి పెరిగింది. 107 స్థానంలో పేదరికం మనది. నేపాల్, పాకిస్థాన్ కూడా మనకందే ముందే ఉన్నాయి. ఒక వేళ బీజేపీ గెలిస్తే బావి మోటార్లకు మీటర్లు వస్తాయి. అప్రమత్తంగా ఉండండి.

                    –    హరీశ్ రావు, తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి