టీడీపీ ఫ్లెక్సీలతో హైదరాబాద్ పసుపుమయం అయింది. గురువారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తారు చంద్రబాబు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి పంజాగుట్ట వరకు ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ తెలంగాణ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శనివారం ప్రజాభవన్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై చర్చిస్తారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా.. రాజ్నాథ్ సింగ్, రాందాస్ అథవాలేతో భేటీ అయ్యారు. కేంద్రబడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యతపై నిర్మలా సీతారామన్తో చర్చించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..