ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

| Edited By:

Jul 28, 2020 | 12:57 PM

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె బ‌షీరున్నిసా బేగం(93) ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యం కార‌ణంగా బాధ‌ప‌డుతున్న ఆమె మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున తుది శ్వాస విడిచారు. నిజాం న‌వాబు సంతానంలో ఇప్ప‌టివ‌ర‌కూ..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి
Follow us on

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె బ‌షీరున్నిసా బేగం(93) ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యం కార‌ణంగా బాధ‌ప‌డుతున్న ఆమె మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున తుది శ్వాస విడిచారు. నిజాం న‌వాబు సంతానంలో ఇప్ప‌టివ‌ర‌కూ బ‌తికి ఉన్న‌ది ఆమె ఒక్క‌రే. బ‌షీరున్నిసా బేగం 1927లో జ‌న్మించారు. కాగా బ‌షీరున్నిసాకు అలీ పాషాగా పేరొందిన.. న‌వాబ్ కాసిం యార్ జంగ్‌తో వివాహ‌మ‌య్యింది. వీరు పురాణీ హ‌వేలీలో నివ‌సిస్తున్నారు. కాగా అలీ పాషా 1998లో మ‌ర‌ణించారు. బ‌షీరున్నిసా బేగం మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు తీవ్ర సానుభూతి వ్య‌క్తం చేశారు. ఆమె భౌతిక కాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పిస్తున్నారు. పాత‌బ‌స్తీలోని ద‌ర్గా యాహియా పాషా స్మ‌శాన వాటిక‌లో బ‌షీరున్నిసా అంత్య‌క్రియ‌లు జ‌ర‌గనున్నాయి.

Read More:

వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..

న‌ల్గొండ‌లో ఆగ‌ష్టు 14 వ‌ర‌కు లాక్ డౌన్..

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..