D Srinivas: డీఎస్ ప్రస్థానం ఇదే.. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం రేవంత్
D Srinivas passes away: నిజామాబాద్లో ఇవాళ అధికారిక లాంఛనాలతో డీ శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి.శ్రీనివాస్.. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు.
D Srinivas passes away: నిజామాబాద్లో ఇవాళ అధికారిక లాంఛనాలతో డీ శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి.శ్రీనివాస్.. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు. డీఎస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు.. రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం..
దాదాపు 40 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డి.శ్రీనివాస్.. డీఎస్గా, శీనన్నగా సుపరిచితులు. బీసీ నేతగా, తెలంగాణవాదిగా, రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. నిజామాబాద్జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో రైతు కుటుంబంలో 1948 సెప్టెంబర్ 27న డీఎస్ జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం డిగ్రీ, తర్వాత లా పూర్తి చేశారు. 1974 నుంచి 84 దాకా రిజర్వ్ బ్యాంకులో పని చేశారు. ఆ టైమ్లో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఇందిరాగాంధీ పిలుపు మేరకు జాబ్కు రిజైన్ చేసి ఎన్ఎస్యూఐలో చేరారు.
డీఎస్లోని లీడర్షిప్ క్వాలిటీస్ గ్రహించిన ఇందిరాగాంధీ.. ఆయనను ఉమ్మడి ఏపీకి మొదటి ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించిన డీఎస్.. పార్టీలోఅంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడిగా, జనరల్సెక్రటరీగా, 2004, 2009లో పీసీసీ ప్రెసిడెంట్గా పని చేశారు. ఇక 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీఆర్ఎస్లో చేరిన డీఎస్.. 2016 నుంచి 2022 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత.. ఆయన ఆరోగ్యం క్షీణించటంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..