CM KCR: హుజూరాబాద్‌లో రెండు సభలకు సీఎం కేసీఆర్ ప్లాన్.. ఆగస్ట్ 16న దళితబంధు.. ఆ తర్వాత..

|

Aug 02, 2021 | 7:42 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. అతి త్వరలో CM KCR రెండు బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వహించనున్నారు. ఒకటి దళిత బంధు పథకం ప్రారంభ సభ కాగా, రెండోది హుజురాబాద్...

CM KCR: హుజూరాబాద్‌లో రెండు సభలకు సీఎం కేసీఆర్ ప్లాన్.. ఆగస్ట్ 16న దళితబంధు.. ఆ తర్వాత..
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. నాగార్జన సాగర్ ఉపఎన్నికల హామీల్లో భాగంగా అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పర్యటన కొనసాగనుంది.
Follow us on

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. అతి త్వరలో CM KCR రెండు బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వహించనున్నారు. ఒకటి దళిత బంధు పథకం ప్రారంభ సభ కాగా, రెండోది హుజురాబాద్ ఎన్నికల సభను ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లను చేయడానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న తెలంగాణ దళిత బంధు పథకాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల నుండి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ పథకంతో దళితుల్లో ప్రగతి వెలుగులు నింపాలని, ఆ కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ఆగస్ట్ 16న.. హుజురాబాద్‌లో ఈ ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించ‌నున్నారు. ఇందుకోసం కేవ‌లం హుజురాబాద్ నియెజ‌క‌వ‌ర్గం నుంచే కాకుండా జిల్లాస్థాయిలో ద‌ళితుల‌ను స‌మీక‌రించి ద‌ళిత మ‌హ‌స‌భ ఎర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గతంలో రైతు బంధు పథకాన్ని కూడా ఇదే నియోజకవర్గం శాలపల్లిలో ప్రారంభించారు. అయితే అంతకు మించిన.. పెద్ద బ‌హిరంగ‌స‌భ‌ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మరోవైపు పార్టీలో ఉన్న క్యాడర్ ను కాపాడుకోవడంతో పాటు వారిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు సెప్టెంబర్‌లో హుజూరాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దళితబంధు సభపై అటు అధికారులు.. పార్టీ సభపై TRS శ్రేణులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఈటల రాజేందర్ బర్తరఫ్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత.. హుజురాబాద్ పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. రానున్న ఉప ఎన్నికల్లో TRS పార్టీని గెలిపించడంకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని ఇప్పటికే CM KCR ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తో పాటు హరీష్ రావును ఆదేశించారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పలు పార్టీ సమావేశాలతో పాటు కులాల వారీగా కూడా మీటింగ్‌లను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: Viral Video: వామ్మో.. పెళ్లి కూతురా మజాకా.. ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది.. చూస్తే షాక్ అవుతారు..

Personal Loan: మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. తక్కువ వడ్డీ కోసం ఈ 4 చిట్కాలను తెలుసుకోండి..