Mirchi Price: ఒక వైపు బంగారం ధరలు దూసుకుపోతుంటే.. దానికి సమానంగా మార్చి ధర కూడా పరుగులు పెడుతోంది. మిర్చి అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు పసిడితో మిర్చి పోటీ పడుతోంది. మిర్చి ధర రికార్డు (Mirchi Rate Record), స్థాయిలో దూసుకుపోతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో ఎన్నడు లేని విధంగా మిర్చి ధర పెరిగిపోతోంది. కరీంనగర్ (Karimnagar) జిల్లాలో మిర్చి ధర భారీగా పలుకుతోంది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు మిర్చి ధర రూ.50వేలకు చేరువలో ఉంది. క్వింటాల్ ధర రూ.48వేలుగా ఉంది. ప్రస్తుతం మిర్చి ధర బంగారంతో పోటీ పడుతుండటంతో విశేషం. కొన్ని రోజుల కిందట రూ.37వేలు పలికిన మిర్చి ధర.. ప్రస్తుతం రికార్డు బ్రేక్ చేస్తోంది. దేశీ రకం మిర్చి ఎక్కువగా పండించే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకాల వర్షాలతో పంట తవ్రంగా దెబ్బతింది. వేలాది ఎకరాల్లో మిర్చి పంట నేలపాలైంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానకు మిర్చి తోటలు సైతం తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. అకాల వర్షాల కారణంగా మిర్చి రైతులకు మరింత నష్టం వాటిల్లింది. అయితే అకాల వర్షాల కారణంగ దిగుబడులు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ మార్కెట్లో రేట్లు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఉపశమనం పొందుతున్నారు. దేశ చరిత్రలోనే ఆల్ టైమ్స్ రికార్డు ధరలు నమోదు అవుతున్నాయి. మిర్చి ధర ఇంత పలకడం తొలిసారని రైతులు చెబుతున్నారు.
రికార్డు స్థాయిలో పత్తి ధర
ఇక పత్తి ధర కూడా రికార్డు స్థాయిలో వెళ్తోంది. ఈ మార్కెట్లో పత్తికి కూడా భారీగా ధర పలుకుతోంది. క్వింటాలు పత్తికి రూ.10,720 పలుకుతుంది. సగటున రూ.9,325గా నమోదైంది. జమ్మికుంట మార్కెట్కు 12 ట్రాలీలు పత్తి విక్రయానికి రాగా, గరిష్టంగా రూ.10,810 ధర పలికింది. వరంగల్లో రూ.10,720, ఖమ్మంలో రూ.10,600 పలకింది.
ఇవి కూడా చదవండి: