Telangana: ఈ చింత చెట్టుకు పారుతున్న కల్లు.. అమ్మ మాయ అంటూ ఎగబడ్డ జనం..!

| Edited By: Balaraju Goud

Oct 27, 2024 | 4:49 PM

ఎండపల్లి మండల కేంద్రంలోని ఓ కూడలి వద్ద సుమారు వంద ఏళ్లకు పైగా వయసు గల ఓ చింత చెట్టు ఉంది. అకస్మాత్తుగా ఈ చింత చెట్టు కు రెండు రోజులుగా కల్లు పారుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు.

Telangana: ఈ చింత చెట్టుకు పారుతున్న కల్లు.. అమ్మ మాయ అంటూ ఎగబడ్డ జనం..!
White Water From Tamarind Tree
Follow us on

సహజంగా కల్లు.. తాటి లేదా..ఈత చెట్లకు పారుతుంది. ఈ కల్లును చాలా మంది తాగుతారు. అయితే, ఈత, తాటి చెట్టుకు కాకుండా.. చింత చెట్టుకు కల్లు పారడం వింతగా ఉంది. ఈ చింత చెట్టును చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ చింత చెట్టుకు కల్లు పారడం వల్ల ఏ ఉపద్రవం వస్తుందో భయబ్రాంతులు వ్యక్తం చేస్తూ, చెట్టుకు చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాలజ్ఞానం నిజమైంది. తెలంగాణలో తాటి కల్లు మహా ఫేమస్. అదే విధంగా ఈత కల్లు కూడా లభిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కొబ్బరి కల్లు కూడా గీస్తారు. కానీ ఇక్కడి చింత చెట్టుకు కల్లు కారుతుంది. దాంతో ఇదంతా అమ్మ వారి మాయే అంటూ కొందరు చెట్టుకు పూజలు చేస్తున్నారు.

ఎండపల్లి మండల కేంద్రంలోని ఓ కూడలి వద్ద సుమారు వంద ఏళ్లకు పైగా వయసు గల ఓ చింత చెట్టు ఉంది. అకస్మాత్తుగా ఈ చింత చెట్టు కు రెండు రోజులుగా కల్లు పారుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. ప్రతి ఏటా ఇదే చింత చెట్టు కింద వినాయకుడి తోపాటు దుర్గా మాత విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. కాగా, ఈ ఏడాది వినాయక చవితి, దసరా నవరాత్రుల కోసం చింత చెట్టు కొమ్మలను నరికి వేశారు. ఇది జరిగి దాదాపుగా 20 రోజులకు పైనే అవుతుంది.

అయితే, గత రెండు రోజుల నుంచి నరికిన ఓ కొమ్మ నుంచి కల్లు లాంటి తెల్లటి నీరు వస్తుంది. దాంతో చెట్టు కొమ్మకు ప్లాస్టిక్ బాటిల్ కట్టడంతో తెల్లటి ద్రవం నిండింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే చింత చెట్టుకు కల్లు పారుతుందని చర్చించుకుంటున్నారు. మరి కొందరు కలియుగాంతానికి సమయం దగ్గర పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇదంతా దుర్గామాత మాయే అంటూ ప్రచారం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..