తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం
Telangana government: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు. కేసుల తీవ్రత దృష్ట్యా లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. మే 7 వరకు లాక్డౌన్ను కొనసాగించిన విషయం తెలిసిందే. ఫుడ్ ప్రాసెసింగ్ సహా పరిమిత రంగాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
కాగా.. లాక్ డౌన్ నేపథ్యంలో మత్స్యకారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. లాక్డౌన్ ప్రభావంతో వాళ్లంతా ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఉపాధి కోసం చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇచ్చింది. కరోనా సోకకుండా ఉండేందుకు మత్స్యకారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించింది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రంలో ఉంది.