హై అలెర్ట్ : ప్రజలు అప్రమత్తంగా మెలగాలి

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితులపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని రఘుమా ఈ ఉదయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవని చెప్పారు. అన్ని ఫీడర్లు సక్రమంగా ఉన్నాయని వెల్లడించారు. వర్షం నీరు […]

హై అలెర్ట్ : ప్రజలు అప్రమత్తంగా మెలగాలి
Follow us

|

Updated on: Oct 13, 2020 | 12:02 PM

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితులపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని రఘుమా ఈ ఉదయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవని చెప్పారు. అన్ని ఫీడర్లు సక్రమంగా ఉన్నాయని వెల్లడించారు. వర్షం నీరు నిల్వ ఉన్న చోట గల విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద ఇన్సులేషన్ ను తనిఖీ చేసి, విద్యుత్ లీకేజీ లేకుండా చూడండని సీఎండీ.. ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు.

వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయగలరని సీఎండీ ప్రజల్ని కోరారు. విద్యుత్ అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరని ప్రజలకు సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి విన్నవించారు.