బెంగళూరులో గూగుల్ ‘AI’ రీసెర్చ్ ల్యాబ్!

| Edited By:

Sep 22, 2019 | 1:10 PM

దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఇండియాలో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. తన కార్యకలాపాలను ఇండియాలో మరింతగా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా Artificial Intelligence ల్యాబ్ ని కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొల్పింది. ఈ ల్యాబ్ ద్వారా ఉత్పత్తులను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్ దిగ్గజం గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇండియాలో జరిగిన గూగుల్ ఈవెంట్లో వెల్లడించింది. బెంగుళూరు ల్యాబ్ కి SEM (Society for Experimental […]

బెంగళూరులో గూగుల్ AI రీసెర్చ్ ల్యాబ్!
Follow us on

దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఇండియాలో సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. తన కార్యకలాపాలను ఇండియాలో మరింతగా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా Artificial Intelligence ల్యాబ్ ని కర్ణాటక రాజధాని బెంగుళూరులో నెలకొల్పింది. ఈ ల్యాబ్ ద్వారా ఉత్పత్తులను ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలని మౌంటెన్ వ్యూ హెడ్ క్వార్టర్ దిగ్గజం గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఇండియాలో జరిగిన గూగుల్ ఈవెంట్లో వెల్లడించింది. బెంగుళూరు ల్యాబ్ కి SEM (Society for Experimental Mechanics )విభాగంలో మనీష్ గుప్తా లీడ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఇండియాలో వైపై విస్తరణ కోసం గూగుల్ బిఎస్ఎన్ఎల్ తో జత కట్టిన సంగతి విదితమే.

దేశవ్యాప్తంగా ‘వై-ఫై సేవలను విస్తరించాలన్న లక్ష్యంతో గూగుల్ సంస్థతో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు టెలికం రంగ సంస్ధలకు దీటుగా వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త పంథాతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా టెక్ దిగ్గజం ‘గూగుల్’తో జత కట్టింది. గుజరాత్, బీహార్, మహారాష్ట్ర లో కొన్ని గ్రామాలను వైపై హాట్ స్పాట్ విలేజ్ లుగా తీర్చిదిద్దనుంది. దేశ వ్యాప్తంగా 5000 వెన్యూలను, మూడు రాష్ట్రాల్లో 500 రైల్వే స్టేషనన్లలో వైపై కేంద్రాలను ఏర్పాటు చేయడం గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.