తమిళనాట భయం గుప్పిట్లో ప్రజానీకం

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావానికి జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేరళ – తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి, కోయిఅంబత్తూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు నిండిపోయిన భవానిసాగర్ డ్యాం తాజా పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టింది. ప్రస్తుతం కూడా భవానీసాగర్ డ్యాం ప్రమాదకరంగా మారడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు, కర్ణాటక – […]

తమిళనాట భయం గుప్పిట్లో ప్రజానీకం
Follow us

|

Updated on: Sep 22, 2020 | 9:32 AM

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావానికి జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేరళ – తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కన్యాకుమారి, నీలగిరి, కోయిఅంబత్తూర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే రెండు సార్లు నిండిపోయిన భవానిసాగర్ డ్యాం తాజా పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టింది. ప్రస్తుతం కూడా భవానీసాగర్ డ్యాం ప్రమాదకరంగా మారడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు, కర్ణాటక – తమిళనాడు సరిహద్దు జిల్లాలో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

కర్ణాటక లోని కేఆర్ ఎస్ డ్యాం నుండి 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఇవాళ, రేపు ధర్మపురి, క్రిష్ణగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో వరద ముంపు ప్రమాదమున్న గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కేరళ, కర్ణాటక నుండి భారీగా వరదనీరు వస్తుండటంతో సరిహద్దు జిల్లాలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. వరద ముంపు ఉండటంతో డ్యాంల నుండి ఎప్పటికపుడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.