Neeraj Chopra: మరో చరిత్రకు అడుగుదూరంలో జావెలిన్‌ త్రో స్టార్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు నీరజ్‌..

|

Jul 22, 2022 | 8:00 AM

World Athletics Championships 2022: ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రముఖ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఒరేగాన్‌లోని హ్యూజిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 పోటీల్లో..

Neeraj Chopra: మరో చరిత్రకు అడుగుదూరంలో జావెలిన్‌ త్రో స్టార్‌.. వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు నీరజ్‌..
Neeraj Chopra
Follow us on

World Athletics Championships 2022: ఒలింపిక్‌ ఛాంపియన్‌, ప్రముఖ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఒరేగాన్‌లోని హ్యూజిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌-2022 పోటీల్లో భాగంగా అతను 88.39 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. తద్వారా ఫైనల్‌ రౌండ్‌ పోటీలకు అర్హత సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ పోటీల్లో ఇప్పటి వరకు ఈ పోటీల్లో భారత్‌ నుంచి అంజూబాబి జార్జ్‌ మాత్రమే పతకం నెగ్గింది. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె కాంస్య పతకం సాధించింది.ఆ తర్వాత మరే అథ్లెట్‌ ఈ పోటీల్లో పతకం తీసుకురాలేదు. మరి కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆసియా క్రీడలు, ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన నీరజ్‌కు ఆదివారం జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడేమోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదివారం ఫైనల్..

కాగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు అర్హత మార్కును 83.50 మీటర్ల వద్ద ఉంచారు. కాగా నీరజ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరాన్ని అధిగమించి ఫైనల్‌ బెర్తను ఖరారు చేసుకున్నాడు. ఈ ఏడాది అతడికి ఇది మూడో అత్యుత్తమ త్రో. జూన్ 30న స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో 89.94 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి కొత్త రికార్డు సృష్టించాడు నీరజ్‌. అయితే 90 మీటర్ల దూరానికి కేవలం 6 సెంటీ మీటర్ల దూరంలో నిలిచిపోయిన ఈ ఒలింపిక్‌ ఛాంపియన్‌ ఫైనల్స్‌లోనైనా ఆ ఫీట్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు. కాగా నీరజ్ గ్రూప్‌లో ఉన్న టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత జాకుబ్ వాడ్లేక్ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు. అతను 85.23 మీటర్ల దూరం విసిరాడు. అయితే లండన్ ఒలింపిక్ ఛాంపియన్ కెషోర్న్ వాల్కాట్ 76.63 త్రోతో గ్రూప్‌లో ఏడవ స్థానంలో నిలిచాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే, అతను 2008-09లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సన్ తర్వాత ప్రపంచ టైటిల్‌తో ఒలింపిక్ విజయాన్ని సాధించిన మొదటి జావెలిన్ త్రోయర్ అవుతాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత నీరజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..