ప్రపంచకప్ గెలవడానికి రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ టీమ్ ఇండియాకు ఒక కీలక సలహా ఇచ్చాడు. భారత జట్టు ప్రపంచకప్ గెలవాలంటే ఆ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడకూడదని సూచించాడు. ఆటగాళ్ళు తమ పనిభారాన్ని నిర్వహించడానికి, పూర్తిగా ఫిట్గా ఉండాలంటే ఐపీఎల్కు దూరంగా ఉండాలని చెప్పుకొచ్చాడు.
గత కొన్నేళ్లుగా భారత జట్టు ప్రపంచకప్ను గెలవలేకపోయింది. 2013 నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న టీమ్ ఇండియా 2011 నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవలేదు. గత టీ20 ప్రపంచకప్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన టీమిండియా ఈసారి కూడా సెమీఫైనల్లో ఓడి నిష్క్రమించాల్సి వచ్చింది.
టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం ఆటగాళ్లు అలసిపోవడమేనని చాలాసార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆటగాళ్లు అలసిపోకుండా రిఫ్రెష్గా ఉండటానికి IPL ఆడకూడదని రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ అభిప్రాయపడ్డాడు.
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘గత 7-8 నెలలుగా భారత జట్టు ఎప్పుడూ స్థిరంగా లేదు. ప్రపంచకప్నకు సిద్ధమవుతున్నామంటే ముందుగా జట్టును నిలబెట్టుకోవాలి. గత ఏడు నెలలుగా జట్టును పరిశీలిస్తే అసలు ఎవరో ఓపెనింగ్ చేస్తున్నారో, బౌలింగ్ యూనిట్ ఎలా ఉందో కూడా సరైన అవగాహన లేదు. అలాగే జట్టులో నిలకడ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ.. ఇది కూడా కారణమని నేను అనుకోను. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆడుతున్నారు. ఎందుకంటే వారంతా ప్రొఫెషనల్ ప్లేయర్లు. పనిభారాన్ని సాకుగా చెప్పలేరు. మరి ఈ ఆటగాళ్లు ఐపీఎల్లో ఎందుకు ఆడుతున్నారు? ప్రపంచకప్ గెలవాలంటే ఐపీఎల్లో ఆడొద్దు. ఎందుకంటే ఐపీఎల్ కంటే జాతీయ జట్టే మనకు ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..