ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL2021) 14 వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. టాస్ గెలిచిన తర్వాత ఆర్సీబీ(Royal Challengers Bangalore vs Mumbai Indians) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్లో టేకాఫ్ అవుతుందా ప్రజెంటర్ అడిగిన ప్రశ్నకు తనదైన తరహాలో సమాధానం ఇచ్చాడు.
అయితే ఇది చాలా షాకింగ్. షాకింగ్ ఎందుకంటే ఈ ఆటగాడు దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఆర్సిబికి ‘కనిపించలేదు’. ఈ ఆల్ రౌండర్ పేరు డేనియల్ క్రిస్టియన్ (daniel christian). ఎనిమిదేళ్ల క్రితం డేనియల్ ఆర్సిబిలో భాగమయ్యాడు. అయితే చాలా కాలం తరువాత.. ఇప్పుడు అతను తన పాత జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం మళ్లీ మంచి ఆటతీరును ప్రదర్శించాడు.
విరాట్ కోహ్లీ జట్టుకు డేనియల్ క్రిస్టియన్ కోహినూర్ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ దుమ్మురేపే దమ్మున్నోడు. ముంబై ఇండియన్స్తో ఐపిఎల్ 2021 ప్రారంభ మ్యాచ్కు ముందు డేనియల్ క్రిస్టియన్ లీగ్లో 40 మ్యాచ్లు ఆడాడు. వాటిలో 17.84 సగటుతో 446 పరుగులు 119.25 స్ట్రైక్ రేట్తో పాటు, అతను 34 వికెట్లు కూడా తీసుకున్నాడు. డేనియల్ ఇంతకుముందు 2011, 2012, 2013, 2017 తోపాటు 2018 సంవత్సరాల్లో ఐపిఎల్లో పాల్గొన్నాడు. డేనియల్ క్రిస్టియన్ చివరిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం 2013 సీజన్లో కూడా ఆడాడు. అప్పుడు అతను జట్టు కోసం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు.
ఇందులో 2011 లో 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు, 2012 లో 7 మ్యాచ్ల్లో 8 వికెట్లు పడగొట్టాడు. 2013 లో, అతను 2 మ్యాచ్లు ఆడే అవకాశాన్ని పొందాడు, అందులో అతను వికెట్లు పొందలేకపోయాడు. 2017 లో డేనియల్ 13 మ్యాచ్ల్లో 11 వికెట్లు సాధించగా 2018 లో 4 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా జట్టు తరఫున డేనియల్ క్రిస్టియన్ ఆటతీరు విషయానికొస్తే, అతను దేశం కోసం 19 వన్డేల్లో 273 పరుగులు చేయడంతోపాటు 20 వికెట్లు కూడా తీసుకున్నాడు. అదే సమయంలో అతను ఆస్ట్రేలియా తరఫున 16 టీ20 మ్యాచ్లలో కూడా పాల్గొన్నాడు. దీనిలో అతను 11 వికెట్లు పడగొట్టాడు.