“మిమ్మ‌ల్ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది సోనూసూద్”

క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌డౌన్‌ కారణంగా సొంతింటికి చేరుకోడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వలస కూలీలకు ఆస‌రాగా నిలుస్తోన్న బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నా అని తెలిపారు. కాగా సొంత గ్రామానికి వెళ్లేందుకు వలస కూలీలు పడుతోన్న క‌ష్టాలు చూసి తీవ్రంగా చ‌లించిపోయిన‌ సోనూసూద్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాల‌కు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి […]

మిమ్మ‌ల్ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది  సోనూసూద్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 3:41 PM

క‌రోనా క‌ట్టడి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌డౌన్‌ కారణంగా సొంతింటికి చేరుకోడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వలస కూలీలకు ఆస‌రాగా నిలుస్తోన్న బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నా అని తెలిపారు. కాగా సొంత గ్రామానికి వెళ్లేందుకు వలస కూలీలు పడుతోన్న క‌ష్టాలు చూసి తీవ్రంగా చ‌లించిపోయిన‌ సోనూసూద్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్ రాష్ట్రాల‌కు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండ‌గా నిల‌బ‌డుతున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి సోష‌ల్ మీడియాలో సోనూసూద్‌ను రిక్వెస్ట్ చేస్తూ.. ‘సర్‌ దయచేసి నాకు హెల్ప్ చేయండి. మీరు ఏదైనా వెహిక‌ల్ ఏర్పాటు చేసి యూపీలోని ఏ ప్రాంతానికైనా పంపించండి. అక్కడి నుంచి మా ఊరికి నడుచుకుంటూ వెళ్లిపోతాను’ అని సాయం కోసం అభ్య‌ర్థించాడు.

ఆ ట్వీట్‌పై స్పందించిన సోనూ..’నడుచుకుంటూ వెళ్ల‌డం ఎందుకు. మీ ఫోన్‌ నంబర్ పంపండి’ అని రిప్లై ఇచ్చారు. ఇలా వ‌లస కూలీల‌కు తన వంతుగా సాయం చేస్తోన్న సోనూసూద్‌ను‌ స్మృతి ఇరానీ ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. ప్రొఫెష‌న్ ప‌రంగా రెండు దశాబ్దాల నుంచి మీ గురించి నాకు తెలుసు సోనూసూద్‌. మీరు గొప్ప యాక్ట‌ర్ గా ఎదగడం చూసి ఎంతో ఆనందించాడు. ప్రస్తుతం ఉన్నసంక్షోభ‌ పరిస్థితుల్లో మీరు చేస్తున్న సాయం ఇప్పటికీ నన్ను గర్వపడేలా చేస్తోంది’ అని అన్నారు.