సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన గల్ఫ్ ఎన్నారై ప్రతినిధులు
మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రానికి తిరిగి వస్తున్న పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అడిగిందే తడువుగా అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నారై గల్ఫ్ ప్రతినిధులు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ మొదలు పెట్టింది. ఇతర దేశాల నుంచి భారతీయులు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇక, డబ్బులు చెల్లించలేని ఎన్నారైల కోసం ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసి వారికి భోజనం, వసతి ఉచితంగా అందించాలని […]
మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రానికి తిరిగి వస్తున్న పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అడిగిందే తడువుగా అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నారై గల్ఫ్ ప్రతినిధులు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ మొదలు పెట్టింది. ఇతర దేశాల నుంచి భారతీయులు సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇక, డబ్బులు చెల్లించలేని ఎన్నారైల కోసం ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసి వారికి భోజనం, వసతి ఉచితంగా అందించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. పేద గల్ఫ్ కార్మికులకు ఉచిత క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎన్నారై గల్ఫ్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. . ఇందుకోసం సహకరించిన మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతినిధులు.