ఏపీలో కొత్త కరోనా వైరస్ మూలాలు.. న్యూ వేరియంట్కు N440K నామకరణం.. హెచ్చరిస్తున్న సైంటిస్టులు..
తెలుగు రాష్ట్రాలు మరో న్యూ వేరియంట్ కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటికే యూకే 'స్ట్రెయిన్' వైరస్ భయంతో గజగజలాడిపోతున్న ప్రజలకు..
New Coronavirus Tension: తెలుగు రాష్ట్రాలు మరో న్యూ వేరియంట్ కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటికే యూకే ‘స్ట్రెయిన్’ వైరస్ భయంతో గజగజలాడిపోతున్న ప్రజలకు.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ శాస్త్రవేత్తలు మరో దడ పుట్టించే వార్తను చెప్పారు. ఆంధ్రపద్రేశ్లో మరో కొత్త రకం కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఆ న్యూ వేరియంట్కు N440K అని నామకరణం చేశారు. ఈ కొత్త రకానికి కోవిడ్ యాంటీ బాడీస్ నుంచి తప్పించుకునే లక్షణమున్నట్లు సైంటిస్టులు తేల్చారు.
కరోనా పాజిటివ్స్లో మూడింట ఒక వంతులో ఈ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం ఉన్నట్లు తేలింది. ఇటు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఈ ఎన్440కే వైరస్ వెలుగుచూసింది. అలాగే నోయిడాలో కూడా ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసును కూడా గుర్తించారు. జూలై-ఆగష్టు మధ్య 6,370 మంది జన్యువులను విశ్లేషించగా..దేశవ్యాప్తంగా రెండు శాతం మందిలో N440K మ్యుటేషన్ను గుర్తించారు.