Kerala: కేరళను కలవరపెడుతున్న ఆంత్రాక్స్.. జంతువుల నుంచి మనుషులకు.. చివరికి

|

Jun 30, 2022 | 5:38 PM

అంటువ్యాధుల విజృంభణతో కేరళ(Kerala) కలవరపడుతోంది. ఇప్పటికే నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు కేరళలో వెలుగు చూడగా తాజాగా ఆంత్రాక్స్(Anthrax) వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. అత్తిరప్పల్లి అటవీ ప్రాంతంలో ఈ వ్యాధి కారణంగా అడవి....

Kerala: కేరళను కలవరపెడుతున్న ఆంత్రాక్స్.. జంతువుల నుంచి మనుషులకు.. చివరికి
Anthrax
Follow us on

అంటువ్యాధుల విజృంభణతో కేరళ(Kerala) కలవరపడుతోంది. ఇప్పటికే నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు కేరళలో వెలుగు చూడగా తాజాగా ఆంత్రాక్స్(Anthrax) వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. అత్తిరప్పల్లి అటవీ ప్రాంతంలో ఈ వ్యాధి కారణంగా అడవి పందులు చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అత్తిరప్పల్లి ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఐదారు అడవి పందులు మృతి చెందాయి. వాటి మృతదేహాలను పరిశీలించగా ఆంత్రాక్స్ (Anthrax) వ్యాధి కారణంగానే అవి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర పశువులు లేదా మనుషులకు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టారు. ఆంత్రాక్స్‌ అనేది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి. పశువులు, మేకలు, గొర్రెలతోపాటు అడవి జంతువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన జంతువుల మాంసం తినడం వల్ల మనుషులకూ సోకుతుంది. ఈ వ్యాధివల్ల చనిపోయిన కళేబరాలను ఎత్తుకెళ్లేవారికి, వాటి చర్మాలను తొలిచివారికి, తోళ్ల పరిశ్రమలో పనిచేసేవారికీ వ్యాధి ముప్పు అధికంగా ఉంటుంది.

ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు మూడురోజుల్లోనే బయటపడతాయని నిపుణలు చెబుతున్నారు. జ్వరం, రక్తపు విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై పుండ్లు, జలుబు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అత్తిరప్పల్లి అటవీప్రాంతంలో ఆంత్రాక్స్ కారణంగా పందులు చనిపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్రిసూర్ జిల్లా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..