సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబ్ బెదిరింపులు..

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 2:28 PM

తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంటికి, సెక్రటేరియట్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపుతో భద్రతను పెంచారు అధికారులు. చెన్నై రోడ్డులో ఉన్న సీఎం పళనిస్వామి నివాసానికి, మెరీనా తీరంలో..

సీఎం ఇంటికి, సచివాలయానికి బాంబ్ బెదిరింపులు..
Follow us on

తమిళనాడు సీఎం పళనిస్వామి ఇంటికి, సెక్రటేరియట్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. బెదిరింపుతో భద్రతను పెంచారు అధికారులు. చెన్నై రోడ్డులో ఉన్న సీఎం పళనిస్వామి నివాసానికి, మెరీనా తీరంలో కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాగా బాంబు బెదిరింపులు ఇచ్చిన ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం వచ్చిన బెదిరింపు కాల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్‌ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. వెంటనే బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. అలాగే ప్రత్యేక డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి.. నిరంతరం పర్యావేక్షిస్తున్నారు.

Read More:

జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత