గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో తృటిలో ప్రమాదం తప్పింది. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి.. కరోనా పేషెంట్స్ ఉన్న బెడ్స్పై పడింది. ఇది గాంధీలోని ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్న గదిలో జరిగింది. మంగళవారం ఉదయం పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్...
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో తృటిలో ప్రమాదం తప్పింది. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హఠాత్తుగా ఊడి.. కరోనా పేషెంట్స్ ఉన్న బెడ్స్పై పడింది. ఇది గాంధీలోని ఏడో అంతస్తులో కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్న గదిలో జరిగింది. మంగళవారం ఉదయం పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ హుక్ నుంచి ఊడి అమాంతం ఒక్కసారిగా కిందపడింది. ఈ ఘటనలో బెడ్పై ఉన్న కరోనా పేషెంట్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే కరోనా రావడం వల్ల ఇప్పటికే మానసికంగా కుంగిపోయామని ఇప్పుడు ఈ హఠాత్పరిణామంతో మరింత భయాందోళనలకు గురయ్యామని కోవిడ్ పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రి పాలన యంత్రాంగం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కాగా ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావును వివరణ కోరింది గాంధీ యాజమాన్యం. ఈ ఘటన తన దృష్టికి రాలేదని, విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Read More:
సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత
అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటూ భారత్లోనూ అత్యంత తీవ్రంగా కరోనా..