జూన్ 11న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈ నెల 11న జరగనుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జూన్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ బుధవారం ఉత్తర్వులు...
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈ నెల 11న జరగనుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జూన్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ భేటీలో కీలకంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, దానికి సంబంధించిన తగు జాగ్రత్తలపై కూడా చర్చించనున్నారని సమాచారం.
కాగా ప్రస్తుతం ఏపీలో కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్ను టెస్ట్ చేయగా 79 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవికాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది.. విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కోవిడ్-19 నిర్థారణ అయ్యింది. ఇవి కూడా లెక్కగడితే 24 గంటల్లో 180 కేసులు నమోదయినట్లు అవుతుంది. ఇక ఇప్పటివరకు మొత్తం 3279 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనాతో మొత్తం 68 మంది మృతి చెందారు. వ్యాధి నయమై వివిధ ఆస్పత్రులు నుంచి 2244మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 967గా ఉంది.
Read More:
కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి