Pralhad Joshi: మద్దతు ధరకే పంటల కొనుగోలు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..

రాష్ట్ర మార్కెట్‌లలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని.. పంటకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు.

Pralhad Joshi: మద్దతు ధరకే పంటల కొనుగోలు.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన..
Pralhad Joshi - Shivraj Singh Chouhan
Follow us

|

Updated on: Aug 25, 2024 | 4:59 PM

రాష్ట్ర మార్కెట్‌లలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదని.. పంటకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. కేంద్రం పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు పంటలను మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మద్దతు ధర పథకం (MSP) కింద పెసలు క్వింటాల్‌కు రూ. 8682 (ఎంఎస్‌పి) చొప్పున కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. కర్ణాటక రాష్ట్ర మార్కెట్‌లో పెసలు, పొద్దుతిరుగుడు ధర పడిపోయిందని.. పండించిన పంటలకు సరైన ధర లభించక రైతులు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్రం సాయం అందిస్తుందని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు.

ఎమ్‌ఎస్‌పి (MSP) కింద పంటను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. క్వింటాల్‌కు రూ.8682 చొప్పున 2215 మెట్రిక్‌టన్నుల పెసలును కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. అదేవిధంగా 13,210 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పంటను మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిందన్నారు.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ అందిన వెంటనే.. తాను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చవాన్‌ను కలుసుకుని రాష్ట్రంలో పెసలు, పొద్దుతిరుగుడు పంటలను కొనుగోలు చేయాలని అభ్యర్థించినట్లు వెల్లడించారు. వెంటనే కేంద్రమంత్రి అధికారులతో చర్చించి వెంటనే అనుమతి ఇవ్వాలని సూచించారన్నారు. దీని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ప్రహ్లాద్ జోషి ట్వీట్..

తన అభ్యర్థనకు తక్షణమే స్పందించి, కొనుగోలుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చవాన్‌లకు ప్రహ్లాద్ జోషి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని ప్రతి రైతు పక్షాన పనిచేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతుల ప్రతి సమస్యకు తగిన, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వారికి వెన్నుదన్నుగా పనిచేస్తుందని వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్