ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు..

|

Jun 26, 2024 | 9:55 PM

గుజరాత్‌ , రాజస్థాన్‌ , ఒడిశా , ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొడైనార్‌ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. గిర్‌ సోమనాథ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు , వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు..
Heavy Rains
Follow us on

గుజరాత్‌ , రాజస్థాన్‌ , ఒడిశా , ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొడైనార్‌ జిల్లాలో వర్షాల కారణంగా జనజీవితం స్తంభించింది. గిర్‌ సోమనాథ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు , వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బనస్కాంతలో కూడా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో కష్టాలు పెరిగాయి. రాజస్థాన్‌ లోని ధోల్‌పూర్‌లో కూడా భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వరదలతో ప్రజలు తల్లడిల్లారు. పలు వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.

వరదనీరు బయటకు పోయేందుకు ఎలాంటి మార్గం లేదని స్థానికులు తల్లడిల్లుతున్నారు. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తెహ్రీ డ్యాం లోకి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది డ్యాంలో చిక్కుకుపోయిన వాహనాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రుద్రప్రయాగ్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలకు అలర్ట్‌ ప్రకటించింది వాతావరణశాఖ . రాజధాని భువనేశ్వర్‌లో కుండపోత వర్షం కురిసింది . లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంజా , రాయ్‌ఘడ్‌ , గజపతి , కందమాల్‌ , మయూర్‌భంజ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలకు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..