Earthquake: లడఖ్‌లో భూకంపం.. రాత్రి 10గంటల సమయంలో 3.5 తీవ్రతతో ప్రకంపనలు..

|

Feb 17, 2021 | 12:34 AM

Earthquake in Ladakh: ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ - ఎన్‌సీఆర్‌, నోయిడా తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన..

Earthquake: లడఖ్‌లో భూకంపం.. రాత్రి 10గంటల సమయంలో 3.5 తీవ్రతతో ప్రకంపనలు..
Follow us on

Earthquake in Ladakh: ఉత్తర భారతదేశంలో వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ – ఎన్‌సీఆర్‌, నోయిడా తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సోమవారం రాత్రి బీహార్‌లోని నలందాలో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం రాత్రి 10గంటల సమయంలో లడఖ్‌లో సైతం భూకంపం సంభవించింది. రాత్రి 10 గంటల సమయంలో లడఖ్‌లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. దీంతో లడఖ్, లేహ్ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ప్రకంపంనలు రావడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్వల్పంగా భూమి కంపించడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

Also Read:

తమిళనాడులో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన వ్యాన్.. ఐదుగురు మహిళా కూలీల మృతి