తమిళనాడులో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన వ్యాన్.. ఐదుగురు మహిళా కూలీల మృతి

Road Accident: త‌మిళ‌నాడులో ఘోర ప్ర‌మాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోగా.. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు తూటికోరిన్ (తూత్తుకూడి) స‌మీపంలోని..

తమిళనాడులో ఘోర ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన వ్యాన్.. ఐదుగురు మహిళా కూలీల మృతి
Follow us

|

Updated on: Feb 16, 2021 | 11:10 PM

Road Accident: త‌మిళ‌నాడులో ఘోర ప్ర‌మాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోగా.. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు తూటికోరిన్ (తూత్తుకూడి) స‌మీపంలోని మ‌నియాచి వ‌ద్ద ఈ ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. తిరునెల్వేలి జిల్లాలోని తిరుమనకోజుండుపురం నుంచి సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు టుటికోరిన్ జిల్లాలోని సవరిమంగళానికి మినీ ట్రక్‌లో వెళుతున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న చిన్న కాల్వ‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

కాగా ఈ ప్ర‌మాదం గురించి స‌మాచారం అందిన వెంట‌నే అధికార యంత్రాంగం ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ప్ర‌భుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి పంపించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంటున్నారు.

Also Read:

చిన్నారిపై అత్యాచారం కేసులో ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష.. సహకరించిన టీచర్‌కు జీవితఖైదు.. పాట్నా కోర్టు సంచలన తీర్పు

కూతురిని సజీదహనం చేసిన కసాయి తండ్రి.. ఇష్టంలేని పెళ్లి చేసుకుందని కక్ష.. సుపారీ హంతకుడితో అమానుషం.!