కరోనా వైరస్తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కోలుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే 24 గంటలు పరిశీలనలో ఉంచి జ్వరం, శ్వాస ఇబ్బందులు మళ్లీ తలెత్తకుంటే సోమవారం జనరల్ వార్డుకు తరలిస్తామని వారు తెలిపారు.
కాగా ఈ నెల14న అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో సత్యేంద్ర జైన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత పరీక్షలు చేయగా.. రెండు సార్లు నెగిటివ్గా తేలింది. మూడో సారి పాజిటివ్ రావడంతో పాటు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందించారు. అలాగే ప్మాస్లా థెరపీ కూడా ఇవ్వడంతో మంత్రి కోలుకున్నారు. ఇక ఆయన ఆరోగ్యంపై ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ట్వీట్ చేస్తూ.. సత్యేంద్ర జైన్ ఆరోగ్యం నిలకడగా ఉందది., ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.
Read This Story Also: కన్నతల్లే చంపేసింది.. వీడిన 16 రోజుల పసికందు మృతి మిస్టరీ