‘ప్రియాంకను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించండి’

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఈ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం కోరారు. సీనియర్ నేత లక్నోలో ఉండాలని, యూపీలో పార్టీని ముందుండి నడిపించాలని ఆయన కోరారు. జాతీయ స్థాయిలో..

'ప్రియాంకను యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించండి'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 7:20 PM

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఈ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం కోరారు. సీనియర్ నేత లక్నోలో ఉండాలని, యూపీలో పార్టీని ముందుండి నడిపించాలని ఆయన కోరారు. జాతీయ స్థాయిలో ఆ రాష్ట్రం నుంచే పార్టీ పునరుధ్ధరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.  ఢిల్లీ లోధీరోడ్డులో తానుంటున్న బంగళా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ప్రియాంక గాంధీ తన నివాసాన్ని లక్నోకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. పైగా యూపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎన్నో సార్లు ఎండగట్టారు. కార్తీ చిదంబరం తో బాటు కాంగ్రెస్ లోని పలువురు ఇతర నేతలు కూడా ఆమెను సీఎం అభ్యర్థిని చేయాలనీ ఇప్పటినుంచే కోరుతున్నారు. మరో రెండేళ్లలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.