Delhi: ఎగరలేక కిందపడిపోయిన బ్లాక్ కైట్ పక్షి.. సపర్యలు చేసి కాపాడిన ప్రధాని కార్యాలయ సిబ్బంది

|

Aug 10, 2022 | 11:42 AM

డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోయిన బ్లాక్ కైట్ (రాబందు) పక్షిని ప్రధాని నరేంద్ర మోడీ నివాస సిబ్బంది (PM's Residence) రక్షించారు. ప్రస్తుతం పక్షి వైద్యుల పరిశీలనలో ఉందని, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధరణ అయ్యాక అడవిలో....

Delhi: ఎగరలేక కిందపడిపోయిన బ్లాక్ కైట్ పక్షి.. సపర్యలు చేసి కాపాడిన ప్రధాని కార్యాలయ సిబ్బంది
Black Kite
Follow us on

డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోయిన బ్లాక్ కైట్ (రాబందు) పక్షిని ప్రధాని నరేంద్ర మోడీ నివాస సిబ్బంది (PM’s Residence) రక్షించారు. ప్రస్తుతం పక్షి వైద్యుల పరిశీలనలో ఉందని, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధరణ అయ్యాక అడవిలో వదిలేస్తామని వైల్డ్‌లైఫ్ (Wild Life) అధికారులు వెల్లడించారు. డీ హైడ్రేషన్ కారణంగా మంగళవారం ఉదయం ఎగరలేక రాబందు అనే పక్షి నేలపై కూర్చుని ఉంది. దీనిని ప్రధాని నివాసం భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే వైల్డ్‌లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్నాక ఇద్దరు సభ్యుల రెస్క్యూ టీమ్ ఆ పక్షికి తాగునీరు అందించింది తర్వాత దానిని జాగ్రత్తగా అబ్జర్వేషన్ లో ఉంచి, కోలుకున్నాక అడవిలో వదిలేస్తామని చెప్పారు.

కాగా..ఢిల్లీ-మహానగర పరిధిలో పక్షులను కాపాడాలనే ఫోన్ కాల్స్ తరచూ వస్తున్నాయని వైల్డ్ లైఫ్ అధికారులు వెల్లడించారు. ఇది సంక్లిష్టమైన పరిస్థితి కానప్పటికీ, పక్షులకు భూమిపై నీటి లభ్యత లేకపోవడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతున్నాయన్నారు. తద్వారా అవి నిర్జలీకరణం చెంది ఎగరలేక కిందపడిపోతున్నాయని వివరించారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ విశాల భూ మండలంపై మనుషులకు జీవించే హక్కు ఎంత ఉందో మిగతా జీవులకూ ఆ హక్కు అంతే ఉందన్న విషయాన్ని గ్రహించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..