అసోం వరదలకు 110 మంది మృతి

| Edited By:

Aug 13, 2020 | 6:30 PM

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వంద మందకిఇ పైగా వరదల ధాటికి మృతి చెందగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో గ్రామాలు నీట..

అసోం వరదలకు 110 మంది మృతి
Follow us on

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వంద మందకిఇ పైగా వరదల ధాటికి మృతి చెందగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో గ్రామాలు నీట మునిగిపోవడంతో.. అక్కడి ప్రజాల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని ముప్పై జిల్లాలు వరదలకు ప్రభావితమయ్యాయి. దాదాపు 56 లక్షలకు పైగా ప్రజలు వరద బాధితులుగా మారారు. 110 మంది మరణించారు. ఇక అధికారిక లెక్కల ప్రకారం ముప్పై జిల్లాల్లో 9,200 మంది వరకు వరదల ప్రభావంతో అస్వస్థతకు గురయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,205 మంది వరదల ప్రభావంతో తీవ్ర అస్వస్థలకు గురైనట్లు సమాచారం. మరోవైపు వరదల ప్రభావంతో అనేక జంతువులు కూడా మరణించాయి. పలు గ్రామాల్లో పశువులు వరదల్లో కొట్టుకుపోగా.. మరికొన్ని చోట్ల అస్వస్థతకు గురై మరణించాయి.

 

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి