మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది త్వరగా నీరసించి పోతున్నారు. ఉదయం లేచినప్పుడు కూడా నిస్సత్తువతో ఉంటున్నారు. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక సాయంత్రానికి వచ్చే సరికి బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్లు డీలా పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* పగలంతా ఎనర్జీతో ఉండాలంటే రాత్రుళ్లు సరైన నిద్ర ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేక పోతే అది కచ్చితంగా మానసిక ఆరోగ్యంపై పడుతుంది. పెద్దలు కచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి త్వరగా పడుకొని, త్వరగా నిద్రలేవడం వల్ల శరీరం, మనస్సు రీఛార్జ్ అవుతుంది.
* ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాసేపు సూర్యకాంతిలో ఉండాలి. దీనివల్ల కండరాలను బలోపేతం చేయడానికి, మెదడుకు పదును పెట్టే విటమిన్ డీ లభిస్తుంది. రోజంతా ఉషారుగా ఉండొచ్చు.
* రోజంతా ఉషారుగా ఉండాలంటే శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నిద్రపోతే శరీరంలో సహజంగానే నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి.
* ఉదయం లేచిన వెంటనే కచ్చితంగా తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది, కండరాలు చురుకుగా ఉంటాయి దీంతో రోజతంగా శక్తివంతంగా ఉంటారు.
* టిఫిన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది.
* ప్రతీ రోజూ ఉదయాన్ని పాజిటివ్ ఆలోచనతో ప్రారంభించాలి. ఏదైనా పని చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..