మధుమేహాన్ని నియంత్రించాలంటే మంచి జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిదానికీ మంచి బ్యాలెన్స్ని క్రియేట్ చేయడం షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేయడంలో చాలా సహాయపడుతుంది. శారీరక శ్రమ శరీరాన్ని ఇన్సులిన్కు మరింత సున్నితంగా చేస్తుంది. దీని వల్ల షుగర్ లెవెల్ను కంట్రోల్ చేయడం సులభం అవుతుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామంతో పాటు మందులు కూడా సమయానికి తీసుకోవాలి. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉదయం, సాయంత్రం కొంత సమయం పాటు వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం అంటే వర్కవుట్ మాత్రమే కాదు, వాకింగ్ కూడా షుగర్ లెవెల్స్పై సానుకూల ప్రభావం చూపుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు లంచ్, డిన్నర్ తర్వాత తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. మధ్యాహ్న భోజనం తర్వాత అది సాధ్యం కాకపోతే, రాత్రి భోజనం తర్వాతైన సరే కొంతసమయం పాటు వాకింగ్ తప్పనిసరిగా చేయాలి. నిజానికి, తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదల ఉంటుంది. ఇది వ్యాయామం ద్వారా నియంత్రించడంలో సహాయపడుతుంది.
డయాబెటిక్ రోగులకు వ్యాయామం చేయడానికి సరైన సమయం ఉందని మీకు తెలుసా.? డయాబెటిక్ పేషెంట్లు తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలని వైద్యులు సూచించారు. సాధారణంగా, రాత్రిపూట రాత్రి భోజనం చేసిన తర్వాత నడవడం లేదా వ్యాయామం చేయడం మధుమేహ రోగులకు అత్యంత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ సమయం అనేక పరిశోధనలలో ఉత్తమమైనదిగా తేలింది. అయినప్పటికీ, మధుమేహం బాధితులు రోజంతా శారీరకంగా చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. తిన్న తర్వాత లేదంటే, వారికి అవకాశం వచ్చినప్పుడు తగినంత శారీరక శ్రమ చేయాలి.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..