Telangana: పొలం విషయంలో తగాదా.. మహిళపై మరిది, మామ దాడి.. తట్టుకోలేక బాధితురాలు ఏం చేసిందంటే

|

May 22, 2022 | 11:07 AM

భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటున్న మహిళ పట్ల అత్తింటివారు క్రూరంగా ప్రవర్తించారు. పొలం విషయంలో తలెత్తిన గొడవల కారణంగా ఆమెను తీవ్రంగా కొట్టారు. మామ, మరిది కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై....

Telangana: పొలం విషయంలో తగాదా.. మహిళపై మరిది, మామ దాడి.. తట్టుకోలేక బాధితురాలు ఏం చేసిందంటే
Suicide
Follow us on

భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఉంటున్న మహిళ పట్ల అత్తింటివారు క్రూరంగా ప్రవర్తించారు. పొలం విషయంలో తలెత్తిన గొడవల కారణంగా ఆమెను తీవ్రంగా కొట్టారు. మామ, మరిది కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం బయటకు తెలిస్తే తమ కుటుంబానికి శిక్ష పడుతుందని భావించాడు. మృతదేహాన్ని డ్యాంలో పడేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా మరిది కొట్టడంతో మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వికారాబాద్(Vikarabad) జిల్లాలోని మోమిన్ పేట్(Mominpet) మండలం అమ్రాదికలాన్‌ గ్రామానికి చెందిన సంఘముని భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన కూతుళ్లు, మరిది, మామతో కలిసి నివాసముంటోంది. వీరికి పదెకరాల పొలం ఉంది. అందరూ కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకునేవారు. కొన్నాళ్లుగా పొలం విషయమై వారి మధ్య వివాదాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో సంఘమునిని ఆమె మామ, మరిది కొట్టారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలసుకున్న మరిది గ్రామ పెద్దలకు తెలిస్తే కుటుంబ సభ్యులకు శిక్ష పడుతుందని భయపడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని బావిలో నుంచి బయటకు తీసి సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం పరిసరాలలోని సింగూర్‌ డ్యాం వంతెన పైనుంచి నీటిలో పడేశాడు. ఏమీ తెలియనట్టు మంగళవారం పోలీస్ స్టేషన్ లో వదిన కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా సంఘముని మృతికి కారణం కుటుంబ సభ్యులేనని తేలింది. మరిదిని తమదైన శైలిలో విచారించగా శవాన్ని సింగూర్‌ డ్యాంలో పడేసినట్టు అంగీకరించాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ.. ఇప్పటికీ అంతుచిక్కని ఆ గ్రామం మిస్టరీ.. ఎక్కడుందంటే..

Dhanush: మధురై దంపతులకు నోటీసులు పంపిన హీరో.. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానంటూ..