Viral News Latest: విధి మనుషుల జీవితాలతో ఎన్నో రకాలుగా ఆడుకుంటుంది. ధనవంతుడిని ఒక్కసారిగా బిచ్చగాడిని చేయగలదు. అలాగే పేదవాడిని ఓవర్ నైట్లో లక్షాధికారిని చేస్తుంది. అటు కొన్నిసార్లు దీని వల్ల విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. దానికి సరైన ఉదాహరణే ఈ ఘటన.
కేరళలో ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టేలోపే.. దురదృష్టం చావు రూపంలో వచ్చి అతడిని కుటుంబానికి దూరం చేసింది. అలప్పుళకు చెందిన ఓ వ్యక్తికి లాటరీ రూపంలో రూ. 60 లక్షల రూపాయలు వరించాయి. దాన్ని పొందడానికి ముందే గుండెపోటుతో అతడు మరణించడంతో ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. వివరాల్లోకి వెళ్తే..
అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి స్థానికంగా ఓ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన దుకాణంలో ‘స్త్రీ శక్తి’ లాటరీలను తెచ్చి విక్రయించాడు. మొత్తం లాటరీ టిక్కెట్లు అమ్ముడుపోగా.. మిగిలిన 10 టిక్కెట్లను తన దగ్గర పెట్టుకున్నాడు. ఇక లాటరీ ఫలితాలు వెల్లడించగా.. అందులో అతని దగ్గర ఉన్న టిక్కెట్లలో ఒకదాని రూ. 60 లక్షల బహుమతి లభించింది.
దీనితో తంబీ ఆనందానికి అవధులు లేవు. డబ్బులు తీసుకోవడానికి దగ్గరలో ఉన్న ఫెడరల్ బ్యాంక్కు వెళ్ళాడు. ఆ డబ్బులతో తన దుకాణం విస్తరణతో పాటు పిల్లల భవిష్యత్తు గురించి కూడా పక్కా ప్రణాళికలను వేసుకున్నాడు. అయితే విధి అతన్ని మరో రకంగా పలకరించింది. బ్యాంక్కు వెళ్లిన సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
For More News:
ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…
కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..
కరోనా ఎఫెక్ట్.. 6 వేల కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..
సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…
పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…
మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?