సురేష్ రైనా బంధువుల హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

క్రికెటర్ సురేష్ రైనా బంధువుల్లో ఇద్దరిని హత్య చేసిన ముఠా లోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ కోట్ లో గత నెలలో జరిగిన ఈ దారుణంలో సురేష్ రైనా బంధువు అశోక్ కుమార్, ఆయన కుమారుడు తీవ్ర గాయాలతో..

సురేష్ రైనా బంధువుల హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 1:20 PM

క్రికెటర్ సురేష్ రైనా బంధువుల్లో ఇద్దరిని హత్య చేసిన ముఠా లోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ కోట్ లో గత నెలలో జరిగిన ఈ దారుణంలో సురేష్ రైనా బంధువు అశోక్ కుమార్, ఆయన కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ తో కేసు పరిష్కారమైందని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు. 11 మందితో కూడిన అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాలోని సభ్యుల్లో ఈ ముగ్గురూ ఉన్నారని,  ఇంకా పరారీలో ఉన్నవారిని త్వరలో అరెస్టు చేస్తామని డీజీపీ దినకర్ గుప్తా తెలిపారు. పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ సమీపంలోని మురికివాడల్లో ఈ ముగ్గురిని పట్టుకున్నాం, వీరి నుంచి రెండు పెద్ద కర్రలు, సుమారు పదహారు వందల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చేప్పారు.