అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ రావు..అదేంటంటే..?

|

Oct 23, 2019 | 8:42 PM

నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిరుపేదలకు నిలువెత్తు గౌరవం అని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదని… అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా..   అగ్రవర్ణాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారని.. వారికి  కూడా డబుల్ బెడ్ రూమ్ […]

అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన హరీశ్ రావు..అదేంటంటే..?
Follow us on

నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిరుపేదలకు నిలువెత్తు గౌరవం అని పేర్కొన్నారు. దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదని… అన్ని వసతులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా..   అగ్రవర్ణాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారని.. వారికి  కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని తెలిపారు.  వ్యవసాయాన్ని లాభదాయకం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత సోషల్ మీడియా ఊబిలో చిక్కుకోని… సమయాన్ని వృథా చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. కష్టపడి పని చేయాలనుకుంటే అనేక అవకాశాలున్నాయని… యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.